

16-08-2020 మనుబోలు( పున్నమి విలేకరి)మనుబోలు మండలం కొండూరు సత్రం నందుగల రామాలయం 12వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సీతా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా పాంచరత్న ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించడం జరిగింది. అర్చకులు జి .శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం జరిగింది తదుపరి సామూహిక విష్ణు సహస్ర పారాయణం పటీంచడం జరిగింది . శ్రీ సీతా రాముల వారి కళ్యాణంనకు ఉబయ కర్తలుగా పసుపులేటి శ్రీనివాసులు శ్రీమతి రమాదేవి దంపతులు వ్యవహరించడం జరిగింది కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అంద చేయడం జరిగింది స్వామివారి కల్యాణం వీక్షించేందుకు హాజరైన భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది

