వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలని ఆమె కోరారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ వినాయక చవితిని భక్తి, శ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజేశ్వరి రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సంతోషం, శ్రేయస్సు, అభివృద్ధి చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.


