ఖమ్మం, జూలై
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులు, మహిళా సిబ్బందిపై ఓ వైద్యుడు వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించారు. బాధితుల ఫిర్యాదును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు మంది సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. కమిటీ వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.



