ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం చారిత్రాత్మక ఖిల్లాను జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖిల్లా పరిసరాలను పరిశీలించి, చారిత్రక వారసత్వ పరిరక్షణ, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఖమ్మం ఖిల్లా మన చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, దానిని భావితరాలకు మరింత గొప్పగా అందించడం అందరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, రాజేష్ గుప్తా, డీకొండ శ్యాం, పిల్లల మర్రి వెంకట్, బోయినపల్లి చంద్రశేఖర్, మారతినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.



