రాష్ట్రంలో అన్ని విధాలా వెనుకబడిన కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చనమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 90 శాతం మంది కాపులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కోటాను అమలు చేయాలన్నారు. మహారాష్ట్రలో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లు ఏపీలోనూ కాపులకు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

కాపులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
రాష్ట్రంలో అన్ని విధాలా వెనుకబడిన కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చనమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 90 శాతం మంది కాపులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కోటాను అమలు చేయాలన్నారు. మహారాష్ట్రలో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లు ఏపీలోనూ కాపులకు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

