బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
పున్నమి ప్రతినిధి అక్టోబర్
జీవీఎంసీ 48వ వార్డ్ శ్రీనివాస్ నగర్ లో పుత్చ అప్పలరెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న 48 వ వార్డు కార్పొరేటర్,జివిఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ తక్షణమే అతని నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అతనికి అందుతున్న వైద్యం వివరాలను గూర్చి ఆరా తీశారు.ఇందులో భాగంగా గంకల కవితా అప్పారావు యాదవ్ తన సొంత నిధుల నుంచి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించారు.బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని గంకల కవిత అప్పారావు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి భరోసా కల్పించి, ఎటువంటి అవసరం ఏర్పడిన తక్షణమే తనకు సంప్రదించాలని సూచించారు.


