Thursday, 25 June 2026
  • Home  
  • కసుమూరు దర్గాలో 50 మందిమహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కసుమూరు దర్గాలో 50 మందిమహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో ‘తాలీమ్ ఏ హునర్’ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసిన 50 మంది మహిళలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సీఈఓ యాకూబ్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటు త్వరలో కంప్యూటర్ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కసుమూరు దర్గాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో ‘తాలీమ్ ఏ హునర్’ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసిన 50 మంది మహిళలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సీఈఓ యాకూబ్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటు త్వరలో కంప్యూటర్ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కసుమూరు దర్గాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.