Friday, 11 July 2025
  • Home  
  • కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…డాక్టర్ సుబ్బరాజు
- Featured

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…డాక్టర్ సుబ్బరాజు

మనుబోలు 29-05-2020(పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామం హరిజనవాడలో మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి తమ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యులను కోరిన క్రమంలో శుక్రవారం నాడు వెంకన్నపాలెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మనుబోలు 29-05-2020(పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామం హరిజనవాడలో మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి తమ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యులను కోరిన క్రమంలో శుక్రవారం నాడు వెంకన్నపాలెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.