ఫ్యామిలీ లో ముగ్గురు సూసైడ్
ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
🖋️భార్య భర్త కొడుకు మృతి
🖋️తాళ్లతో కట్టేసిఉన్న మృతుల చేతులు కాళ్ళు
🖋️అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు
🖋️నెల్లూరు జిల్లా సంగం మండలం లో విషాదం
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావ్ (65) ఆయన భార్య రత్నవాలి (60). కుమారుడు సాయిసుకృత్ 25 ఇంట్లోనే ఉరి వేసుకుని ఉన్న స్థితిలో మృతి చెందారు. చేతులకు తాళ్లు కట్టేసి ఉండడంతో. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యలు జరిగిన ఇంట్లో సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాదినంచేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోవడం వెనక ఉన్న కారణాలపై విచారణ చేస్తున్నారు.



