మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు.మహిళలను ఉద్దేశించి ఎక్కడా అనుచితంగా మాట్లాడలేదని, రాజకీయాల్లో విమర్శలు సహజమని అన్నారు.తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ విమర్శలేనని, వాటిని తెలుగుదేశం పార్టీ వక్రీకరించి ప్రజల్లో భిన్నంగా ప్రచారం చేసిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు,అరకు పార్లమెంటు సభ్యురాలు తనుజా రాణి,శాసనమండలి సభ్యురాలు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి,విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను),జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర,నియోజకవర్గ పరిశీలకులు,సమన్వయకర్తలు,మాజీఎమ్మెల్యేలు,సి.ఇ.సి సభ్యులు,ఎస్.ఇ.సిసభ్యులు,మాజీ డిప్యూటీమేయర్,మాజీ జీవీఎంసీ కార్పొరేటర్ ,ముఖ్య నాయకులు ,సీనియర్ నాయకులు,జిల్లా,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



