ఏన్కూర్లో మాజీ మంత్రి అజయ్ కుమార్కు ఆత్మీయ పలకరింపు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
జూలూరుపాడులో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి అజయ్ కుమార్ ఆదివారం మార్గమధ్యలో ఏన్కూర్ ప్రధాన కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి అజయ్ కుమార్ కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై వారితో ఆరా తీశారు. కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



