ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం బోథ్ లోని శంకర్ రావు భవన్ లో జిల్లా అధ్యక్షులు భరతల గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి విలాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా మహాసభలో డిసెంబర్ లో జరుపుకొని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవాలంబిస్తున్న తీరు పై కార్యాచరణ రూపొందించుకొని, కార్మిక నాయకులుగా మిల్టెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుల చర్చలానంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు ను ఆయన బాధ్యత వహిస్తున్న ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఎండిఎం నుండి తొలగించి, అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కార్యవర్గ సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీడియా ద్వారా జిల్లా ప్రజలకు అన్ని కార్మిక రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరికి జిల్లా అధికారులకు తెలియచేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ కార్యవర్గ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, చంద్రకళ, కళ్ళేపెల్లి గంగయ్య, ఉస్మాన్, కీర్తి రమణ, అలాం, కూన గోదావరి, సత్యభామ, రుక్మిణి లు ఉన్నారు.

ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం
ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం బోథ్ లోని శంకర్ రావు భవన్ లో జిల్లా అధ్యక్షులు భరతల గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి విలాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా మహాసభలో డిసెంబర్ లో జరుపుకొని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవాలంబిస్తున్న తీరు పై కార్యాచరణ రూపొందించుకొని, కార్మిక నాయకులుగా మిల్టెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుల చర్చలానంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు ను ఆయన బాధ్యత వహిస్తున్న ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఎండిఎం నుండి తొలగించి, అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కార్యవర్గ సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీడియా ద్వారా జిల్లా ప్రజలకు అన్ని కార్మిక రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరికి జిల్లా అధికారులకు తెలియచేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ కార్యవర్గ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, చంద్రకళ, కళ్ళేపెల్లి గంగయ్య, ఉస్మాన్, కీర్తి రమణ, అలాం, కూన గోదావరి, సత్యభామ, రుక్మిణి లు ఉన్నారు.

