శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొనాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఎంజీఎం విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. తమ తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంబించబడ్డ ఎంజీఎం విద్యా సంస్థల సిల్వర్ జూబిలీ వేడుకలకు తాను తప్పక హాజరువుతానని ఎంజీఎం డైరెక్టర్ డాక్టర్ మయూర్ కు తెలిపారు. అనంతరం డాక్టర్ మయూర్ మాట్లాడుతూ….శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యా సంస్థలను 2001వ సంవత్సరంలో స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, నారా రామమూర్తి నాయుడుల చేతుల మీదుగా ప్రారంభమై నేటికీ ఎంజీఎం విద్యాసంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్బంగా ఎంజీఎం విద్యాసంస్థలు సిల్వర్ జూబ్లీ వేడుకలు 2026 జనవరి నెలాఖరున జరుగుతాయని ఈ కార్యక్రమమునకు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా, దగ్గుబాటి పురందేశ్వరి గౌరవ అతిథిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్, గౌరవ అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేని ఆహ్వానించిన డాక్టర్ మయూర్
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొనాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఎంజీఎం విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. తమ తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంబించబడ్డ ఎంజీఎం విద్యా సంస్థల సిల్వర్ జూబిలీ వేడుకలకు తాను తప్పక హాజరువుతానని ఎంజీఎం డైరెక్టర్ డాక్టర్ మయూర్ కు తెలిపారు. అనంతరం డాక్టర్ మయూర్ మాట్లాడుతూ….శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యా సంస్థలను 2001వ సంవత్సరంలో స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, నారా రామమూర్తి నాయుడుల చేతుల మీదుగా ప్రారంభమై నేటికీ ఎంజీఎం విద్యాసంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్బంగా ఎంజీఎం విద్యాసంస్థలు సిల్వర్ జూబ్లీ వేడుకలు 2026 జనవరి నెలాఖరున జరుగుతాయని ఈ కార్యక్రమమునకు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా, దగ్గుబాటి పురందేశ్వరి గౌరవ అతిథిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్, గౌరవ అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.

