ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి
మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం.. పైప్ లైన్ లీకేజీలు ఏర్పడి, తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది. గజం లోతులో ఏర్పాటు చేయాల్సిన పైప్ లైన్, అడుగు లోతులోనే వేయడం వల్ల, వాహనాల రాకపోకల ఒత్తిడికి గ్రామంలో సుమారు 30 చోట్ల లీకేజీల సమస్య ఏర్పడింది. దీంతో ఈ పైప్ లైన్ పునఃనిర్మాణం చేయడము లేదా లీకేజీల మరమ్మత్తు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి, గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు చేయుత నివ్వాలని గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నర్సింగారావు కోరారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ చొరవ తీసుకొని తన పొలం బోరుబావి నుంచి తాగునీరు సరఫరా పనులు చేపట్టారు.


