చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు సామాజిక సేవా దృక్పథం నేటితరానికి ఆదర్శం : SA. నయీమ్, ముత్తవల్లి(NTV రిపోర్టర్ సత్యవేడు) MADINA MASJID COMMITTEE PRESIDENT
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం,గోవర్ధనపురం లోని మాదీనా మసీదుకు వయసు మళ్లిన పెద్దవారు సేద తీరడానికి కూర్చోవడానికి బెంచీలు వితరణగా అందించిన చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారికి కృతజ్ఞతలు తెలిపిన మసీదు ముత్తవల్లి SA నయీమ్.
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో ప్రయాణికులు, ప్రజల సౌలభ్యం కోసం కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గోవర్ధనపురం మసీదుకు బెంచీలను వితరణగా అందించి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు..
నిత్యం మసీదుకు వచ్చే వృద్ధుల కోసం కూర్చోవడానికి వీలుగా బెంచీలని అందించాలని మసీదు కమిటీ… కోరిన వెంటనే స్పందించి బెంచీలను అందించి తమ సామాజిక సేవతో మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు..
భవిష్యత్ లో సైతం మసీదుకు అవసరమైన వసతులను కల్పించేందుకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించేందుకు తాము ముందుంటామని ట్రస్టీ మేనేజర్ చాగణం గౌరీశంకర్ హామీ ఇచ్చారు.
తమ సామాజిక విశాల దృక్పథంతో కులమతాలకు అతీతంగా మసీదుకు బెంచీలను వితరణగా అందించిన చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారికి గోవర్ధనపురం మసీదు గురువు హుస్సేన్ అలీబాయ్, జాఫర్, సిద్దిక్, రఫీ అల్లావుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు..



