⭐ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఎన్నికల సందడి.. షెడ్యూల్ విడుదల
అమరావతి (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 15 ::
ఆంధ్రప్రదేశ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (SMC) పునర్నిర్మాణం/ఎన్నికలకు రాష్ట్ర సమగ్ర శిక్ష షెడ్యూల్ విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి SMC ఎన్నికలు సెప్టెంబర్ 29న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీస్ బోర్డుపై ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.
సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసి ప్రదర్శిస్తారు.
⭐ సెప్టెంబర్ 29న ప్రధాన ఎన్నికలు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC సభ్యుల ఎన్నికలు, కమిటీ పునర్నిర్మాణం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం, 3 నుంచి 3:30 గంటల వరకు తొలి SMC సమావేశం నిర్వహించనున్నారు.
📢 పున్నమి హైలైట్
15న నోటిఫికేషన్ → 18న ఓటర్ల జాబితా → 25న తుది జాబితా → ⭐ 29న SMC ఎన్నికలు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.


