Friday, 11 September 2026
  • Home  
  • సాయిబాబా స్వర్ణ సింహాసనానికి రూ.లక్ష విరాళం
- BHADRADRI

సాయిబాబా స్వర్ణ సింహాసనానికి రూ.లక్ష విరాళం

భద్రాచలం: సాయిబాబా ఆలయంలో స్వర్ణ సింహాసనం ఏర్పాటు కోసం వృక్ష మిత్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. భద్రాచలం పట్టణాన్ని హరిత భద్రాద్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో గత 15 ఏళ్లుగా బృందంతో కలిసి భూపతి రావు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మొక్కలు నాటడం, పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భూపతి రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి కేటాయించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. కార్యక్రమంలో చారుగుళ్ల సుబ్బారావు, ఆలయ కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం: సాయిబాబా ఆలయంలో స్వర్ణ సింహాసనం ఏర్పాటు కోసం వృక్ష మిత్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. భద్రాచలం పట్టణాన్ని హరిత భద్రాద్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో గత 15 ఏళ్లుగా బృందంతో కలిసి భూపతి రావు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మొక్కలు నాటడం, పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భూపతి రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి కేటాయించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. కార్యక్రమంలో చారుగుళ్ల సుబ్బారావు, ఆలయ కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.