ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల దేవాదాయ మాన్యం భూములపై ఎండోమెంట్స్ శాఖ అధికారులు గురువారం సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. అయితే సర్వేలో గిరిజన రైతుల భూములకే హద్దులు నిర్ణయించి, ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న భూములను పరిశీలించకుండా వెళ్లిపోయారని స్థానిక గిరిజనులు ఆరోపించారు. ఆలయ ఈవో వేణుగోపాలాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ సమత తదితరులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. దేవాదాయ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు స్థానికులు చేసిన ఆరోపణల ఆధారంగా మాత్రమే. సంబంధిత అధికారుల స్పందన అందాల్సి ఉంది.



