నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నఱ్ఱవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గణాచారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న సోమవారం ఉదయం 9:10 గంటల నుంచి 10:30 గంటలలోపు అమ్మవారికి సెలవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 8న మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బాలాలయంలో అమ్మవారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి కోరారు.

వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దర్శన వేళల్లో మార్పు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నఱ్ఱవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గణాచారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న సోమవారం ఉదయం 9:10 గంటల నుంచి 10:30 గంటలలోపు అమ్మవారికి సెలవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 8న మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బాలాలయంలో అమ్మవారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి కోరారు.

