పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు03 చిట్టమూరు మండలం,
చిట్టమూరు మండలం యాక్సిడెంట్ గ్రామంలో సోమవారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కారపత్రను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ ప్రసారం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల టిడిపి నాయకులు, చిట్టమూరు మండల అధ్యక్షుడు శ్రీ గ గణపర్తి కిషోర్ నాయుడు, మైనార్టీ బీసీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్, టిడిపి నాయకులు, గుంపర్ల చిన్నా రావు, గుండు బోయిన కస్తూరయ్య, గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



