రాజన్న సిరిసిల్ల ఆగస్టు15 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జెల రాజు గారు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్ల ఆగస్టు15 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జెల రాజు గారు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

