.*గౌరవ ముఖ్యమంత్రి శ్రీ *ఎనముల రేవంత్ రెడ్డి గారికి దైనందిని, వినతిపత్రం అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు, అదనపు ప్రధాన కార్యదర్శి*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 04/05/ 2026*
ఈ సమావేశంలో మన సంఘం *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు -తెలంగాణ రాష్ట్ర సంఘ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు *శానమోనినర్సిములు* గారు మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి *అమీర్ పాషా* గారు పాల్గొని మన సంఘం యొక్క 2026 దైనందిని ముఖ్యమంత్రి గారికి ఇచ్చి , ఈ క్రింది అంశాలపై ప్రాతినిద్యం చేయడం జరిగింది.
1. వెంటనే PRC రిపోర్ట్ తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయాలి.
2. పెండింగ్ డిఏలు విడుదల చేయాలి.
3. భాషా పండితుల పాలిట శాపంగా మారిన Act 1/2005 రద్దుచేసి నోషనల్ సర్వీస్ మంజూరు చేయాలి.
4. మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలి.
5. భాషా పండితులకు TET పేపర్ 2 లో మార్పులు చేసి వారికి సంబంధించిన సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలి.
6. జూలై 31 కట్ ఆఫ్ తేదీతో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి.
7. ప్రాథమిక స్థాయిలో భాషా పండిత పోస్టులు మంజూరు చేయాలి.
8. తెలుగు మీడియం పాఠశాలలో కొనసాగించాలి.
9. హిందీ ఉపాధ్యాయులకు వర్కులోడు ఎక్కువైనందున అందుకు అనుగుణంగా మరిన్ని స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను మంజూరు చేయాలి.
10. భాషల పరిరక్షణకై ప్రత్యేకంగా తెలుగు భాష రక్షణ కోసం నిధులు విడుదల చేసి, హైదరాబాదులో మరోసారి అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వం తరఫున నిర్వహించాలి, తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు*


