రాజేంద్రనగర్లోని మానస హిల్స్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా నిర్వహించారని కమిషన్ ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు ఒక చట్టం, మంత్రి సంస్థలకు మరో చట్టమా అని నిలదీసినట్లు పేర్కొంది. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన కమిషన్, రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఎనిమిది వారాల్లో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖను ఆదేశించినట్లు వెళ్ళడాయినది.
మానస హిల్స్ అక్రమ మైనింగ్పై NHRC ఆగ్రహం.. రాఘవ కన్స్ట్రక్షన్స్పై చర్యలకు ఆదేశాలు
రాజేంద్రనగర్లోని మానస హిల్స్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అనుమతులు లేకుండా తవ్వకాలు ఎలా నిర్వహించారని కమిషన్ ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు ఒక చట్టం, మంత్రి సంస్థలకు మరో చట్టమా అని నిలదీసినట్లు పేర్కొంది. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన కమిషన్, రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఎనిమిది వారాల్లో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖను ఆదేశించినట్లు వెళ్ళడాయినది.

