తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు
ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, SIR ప్రక్రియ , పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి , విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.



