బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గొప్ప తనం వర్ణించలేనివని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నయ్య పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు హరనాధపురం లోని ఎస్.వి.ఎస్. స్కూలు నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా వకృత్వ పోటీలు నిర్వహించి, పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్కూలు కరెస్పాండెంట్ పి.వి.రెడ్డి. మాట్లాడుతూ దేశ స్వాతంత్రనంతరం రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడై 11 నెలకకు పైగా శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. ఈకార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



