ప్రభుత్వ బోర్డు మాయం
అధికారులు ఉన్నట్ట,లేనట్టా…!
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
20 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 191 లో ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గుర్తించిన రెవెన్యూ అధికారులు అక్కడ గతంలో రెండుసార్లు హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేశారు. కట్ చేస్తే మళ్లీ బోర్డు మాయమైపోయింది. ఇప్పటిలాగే అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చట్టం సామాన్యుల కైనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.




