రాజంపేట ప్రాంతంలో చీటీల పేరుతో ₹5 కోట్లకు పైగా మోసం జరిగిన ఘటన బాధాకరమని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ అసోసియేషన్స్ తెలిపింది. చీటీలను నమోదు చేయకుండా నిర్వహించడం వల్లే చట్టపరమైన రక్షణలు, వసూళ్ల వ్యవస్థ అందుబాటులో లేక సమస్యలు తీవ్రతరమయ్యాయని పేర్కొంది. చీటీ నిర్వాహకులు తప్పనిసరిగా చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలని, సభ్యులు ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే నమోదిత చిట్ ఫండ్ సంస్థల్లోనే చేరాలని విజ్ఞప్తి చేసింది.

నమోదిత చిట్ ఫండ్లలోనే చేరండి: ఫెడరేషన్ విజ్ఞప్తి
రాజంపేట ప్రాంతంలో చీటీల పేరుతో ₹5 కోట్లకు పైగా మోసం జరిగిన ఘటన బాధాకరమని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ అసోసియేషన్స్ తెలిపింది. చీటీలను నమోదు చేయకుండా నిర్వహించడం వల్లే చట్టపరమైన రక్షణలు, వసూళ్ల వ్యవస్థ అందుబాటులో లేక సమస్యలు తీవ్రతరమయ్యాయని పేర్కొంది. చీటీ నిర్వాహకులు తప్పనిసరిగా చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలని, సభ్యులు ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే నమోదిత చిట్ ఫండ్ సంస్థల్లోనే చేరాలని విజ్ఞప్తి చేసింది.

