భారత తీర భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,200 మత్స్యకార నౌకాశ్రయాలు, చేపల దిగుమతి కేంద్రాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షణలోకి తీసుకురానుంది. ప్రతి కేంద్రంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నేరుగా నియమించకపోయినా, భద్రతా ప్రమాణాలు రూపొందించి స్థానిక అధికారులకు మార్గదర్శకత్వం ఇవ్వనుంది. బయోమెట్రిక్ హాజరు, స్మార్ట్ ఐడీ కార్డులు, పర్యవేక్షణ వ్యవస్థల అమలు వంటి చర్యల ద్వారా తీర ప్రాంత భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం భావిస్తోంది.

దేశవ్యాప్తంగా 1,200 మత్స్యకార నౌకాశ్రయాలపై సీఐఎస్ఎఫ్ నిఘా
భారత తీర భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,200 మత్స్యకార నౌకాశ్రయాలు, చేపల దిగుమతి కేంద్రాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షణలోకి తీసుకురానుంది. ప్రతి కేంద్రంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నేరుగా నియమించకపోయినా, భద్రతా ప్రమాణాలు రూపొందించి స్థానిక అధికారులకు మార్గదర్శకత్వం ఇవ్వనుంది. బయోమెట్రిక్ హాజరు, స్మార్ట్ ఐడీ కార్డులు, పర్యవేక్షణ వ్యవస్థల అమలు వంటి చర్యల ద్వారా తీర ప్రాంత భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం భావిస్తోంది.

