క్రీడాకారులు క్రమశిక్షణకు మారుపేరు


మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి,
డివైఓ సీతారాం నాయక్
నాగర్ కర్నూల్ మండలంలోని తుడుకుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 45 రోజులుగా ఖో ఖో వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహించి గురువారం నాడు ఖో ఖో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లా డివైఎస్ఓ సీతారాం నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు మల్ల సత్యనారాయణ సాగర్ క్రీడాకాలను ఉద్దేశించి మాట్లాడుతూ 45 రోజులుగా తోడుకుర్తి గ్రామ లోని క్రీడా కారులే కాక ఇతర గ్రామాలకు చెందిన క్రీడాకారులు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి 6గంటల వరకు ఖో ఖో క్రీడలో శిక్షణ పొందారు మీరు ఖో ఖో ఆటలో రాష్ట్రస్థాయి కాక జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి, పాఠశాలకు, మంచి పేరు తీసుకొచ్చి క్రీడాకారులుగా ఎదగాలని క్రీడాకారులకు సూచించారు, 45 రోజులుగా మీకు శిక్షణ అందించిన మన పాఠశాల కోచ్ ఫిజికల్ డైరెక్టర్ సామ రమేష్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు, అనంతరం డివైస్ ఓ సీతారామ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖో ఖో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాలుపంచుకున్న క్రీడా కారులందరికీ ప్రపంచ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారనీ, ఈ సందర్భంగా ఖో ఖో క్రీడా వేసవి శిక్షణ శిబిరాన్ని ఈరోజు ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని క్రీడా కారులందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నీతివంతమైన సమాజాన్ని నిర్మించాలని క్రీడలతో పాటు చదువులొ కూడా రాణించాలని అన్నారునీ, ఖో ఖో ఆటతో పాటు, అథ్లెటిక్స్, కబడ్డీ, వంటి క్రీడల్లో రోజు మీరు శిక్షణ పొందుతున్నారనీ, ఈ శిక్షణ లో మంచి మెలకువలు నేర్చుకొని జూలైలో సెకండ్ వీక్ లో జరిగే ఎస్ జి ఎఫ్ క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారని, ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అంజయ్య, కృష్ణమోహన్, ప్రసాద్, వెంకట్, మజార్,లు పాల్గొన్నారనీ, ఖో ఖో వేసవి శిక్షణ శిబిరం కోచ్ సామ రమేష్ తెలిపారు

