*ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య… నాణ్యమైన విద్య లభిస్తుంది*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా ::తేదీ 09 /06/ 2026*
*సర్కార్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని ఉపాధ్యాయులు బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సూచన మేరకు ఈరోజు నాలుగో వార్డ్ ఐదో వార్డ్ బీసీ కాలనీ మామిడిమాడ గ్రామంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఎంఎన్ విజయకుమార్ ,చంద్రశేఖర్, బాలేశ్వర్ వారితో పాటు నాలుగో వార్డ్ మెంబర్ రాములు పూర్వ విద్యార్థులు పాల్గొని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అంతా స్థానిక ఉన్నత పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే అన్ని రకాల విద్యాసంబంధ కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వ బడులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు గత పదవ తరగతి లో గత సంవత్సరం 10వ తరగతిలో మామిడి మాడ ఉన్నత పాఠశాల నుంచి మండల టాపరుగా, హరిహరన్ విద్యార్థి రాఘవేందర్ , మరియు అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్థానిక పాఠశాలలోనే పిల్లలను చదివించాలని వారు ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న అన్ని రకాల డిజిటల్ రూపంలో పాఠాలు,సైన్స్ ల్యాబ్ ,లైబ్రరీ, వ్యాయామ విద్య, యోగా కరాటే విద్య , పదో తరగతి విద్యార్థులకుప్రత్యేక తరగతులు తదితర అంశాలలో ఉపాధ్యాయులు అత్యుత్తమ అర్హతలు కలిగి అనుభవజ్ఞులు ఉండటం చేత ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య ,నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని వారు ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు*


