ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 17 పున్నమి ప్రతినిధి
డిజిటల్ విద్యుత్ మీటర్లు అమర్చిన ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ప్రతి నెల విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని అధికారులు సూచించారు. డిజిటల్ మీటర్ల ద్వారా బిల్లులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయని, బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేయరాదని వివరించారు. ఈ మేరకు నెల్లూరు రోలర్స్ సబ్ డివిజన్ పొదలకూరు వీఆర్వో ఆఫీస్ నుండి . జేఏవో విజయలక్ష్మి, యూడీసీ రాజశేఖర్, ఎల్డీసీ సునీల్.ఎంపీడీవో ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్, తదితర శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ప్రతి కార్యాలయం బిల్లులను నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


