ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భ్రమల్లో ముంచెత్తేందుకు నిర్వహించిన కార్యక్రమమే ‘మహానాడు’ కాదని, అది ‘మాయనాడు’ అని వ్యాఖ్యానించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, ఆడబిడ్డ నిధి సహా పలు పథకాలను విస్మరించిందన్నారు. మహిళల భద్రత, సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యం, సాధికారత లభించిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు.. ‘మాయనాడు’ – కాకాణి పూజిత
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భ్రమల్లో ముంచెత్తేందుకు నిర్వహించిన కార్యక్రమమే ‘మహానాడు’ కాదని, అది ‘మాయనాడు’ అని వ్యాఖ్యానించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, ఆడబిడ్డ నిధి సహా పలు పథకాలను విస్మరించిందన్నారు. మహిళల భద్రత, సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యం, సాధికారత లభించిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

