టీజీఆర్ఈడీసీ డి. ఈ. పాల్వంచ
బంధువుల ఇళ్లలో నివాసాల్లో ఏసీబీ సోదాలు
జులై 22 ఖమ్మం జిల్లా (పున్నమి ప్రతినిధి) గుగులోత్ భావుసింగ్ నాయక్
పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని రాహుల్ గాంధీ నగర్ టీజీ రెడ్ కో ఇంజనీర్ బంధువుల ఇళ్లలో సోదాలు. ఖమ్మం ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం పాల్వంచ లో బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) టీజీఆర్ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
మాధాపూర్లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల సోదాలు నిర్వహిస్తున్నారు.
విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.


