జనసేన పార్టీపై దుష్ప్రచారం చేయడం తక్షణమే మానుకోవాలని తొలి వెలుగు రఘును జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మిరియాల రామకృష్ణ (ఆర్కే) కోరారు. గత 13 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎదుర్కొన్న అన్యాయాలపై వారి ఆకాంక్షలకు వేదికగా జనసేన పనిచేస్తోందన్నారు. సామాజిక తెలంగాణ సాధనకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీసీ వాదాన్ని అడ్డుపెట్టుకుని ఎదుగుతూ అదే బీసీలపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావుపై చేసిన నిరాధార ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్, దందాలకు పాల్పడే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.



