చీకటి రోజులు ఎన్ని వచ్చినా.. చివరికి గెలిచేది నిజమే!
53 రోజుల నిర్బంధాన్ని గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 9:
చీకటి రోజులు ఎన్ని ఎదురైనా చివరికి గెలిచేది నిజమేనని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, 53 రోజుల నిర్బంధాన్ని గుర్తుచేసుకుంటూ సెప్టెంబర్ 9న నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, వారి సతీమణి శ్రీమతి శిరీష గారు, కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన ఘటనను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆ 53 రోజుల నిర్బంధం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 9ను నిజం గెలిచిన రోజుగా గుర్తుచేసుకుంటూ, ఆ చీకటి రోజుల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదుర్కొన్న పరిస్థితులను స్మరించుకున్నారు. చీకటిని పారద్రోలే వెలుగుకు ప్రతీకగా కొవ్వొత్తులు వెలిగించి నిజం గెలిచిన విజయాన్ని చాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. “చీకటి రోజులు ఎన్ని వచ్చినా.. చివరికి గెలిచేది నిజమే. 53 రోజుల నిర్బంధం చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. సెప్టెంబర్ 9 మాత్రం నిజం గెలిచిన రోజు. ఆ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగిద్దాం.. నిజం గెలిచిన విజయాన్ని చాటుదాం” అని పిలుపునిచ్చారు.
నిజం కోసం జరిగిన పోరాటాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించడం ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సంఘీభావాన్ని తెలిపారు.
“నిజంగెలిచింది” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 9ను నిజం గెలిచిన రోజుగా గుర్తుచేసుకుంటూ టీడీపీ శ్రేణులు, అభిమానులు ఈ కార్యక్రమానికి సంఘీభావం



