పున్నమి న్యూస్ డి హరికృష్ణ జులై 22 చిట్టమూరు మండలం,
మండల కేంద్రమైన చిట్టమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది.
నెల్లూరు జిల్లా కోట మండలం చెంద్రుడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ సహాయ సహకారాలతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని తిరుపతి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించే 172 మందికి కంటే వైద్య నిపుణుల జివివి రమణ కంటి పరీక్షలు నిర్వహించారు.
దృష్టిలోపం ఉన్న వారిని గురించి వారికి కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు రమణ తెలిపారు.
ఈ నేత్ర వైద్య శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు ప్రారంభించారు.
జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆదేశం మేరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ ఉచిత వైద్య శిబిరానికి ఎం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు సహాయ సహకారాలు అందించారని ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి బాల్రెడ్డిపాలెం పిహెచ్సి నేత్ర వైద్య నిపుణులు జివివి రమణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



