ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ కూడలిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రతులు, బాండ్లను చింపివేసి నిరసన తెలిపారు. ప్రజా తీర్పు, ప్రజాస్వామ్య విలువలను అవమానించే రాజకీయాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు: మనుబోలులో వైసీపీ నిరసన
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ కూడలిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రతులు, బాండ్లను చింపివేసి నిరసన తెలిపారు. ప్రజా తీర్పు, ప్రజాస్వామ్య విలువలను అవమానించే రాజకీయాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

