తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన బోనాల పండుగను మనుబోతులగడ్డ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ *శ్రీమతి ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్* గారు గ్రామంలోని *శ్రీ ముత్యాలమ్మ తల్లి* ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించి, గ్రామంలో వర్షాలు సకాలంలో కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రోగాలు రాకుండా కాపాడాలని మొక్కులు చెల్లించారు.
గ్రామ మహిళలు బోనాలు, పూజా సామాగ్రితో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దలు, యువకులు అమ్మవారికి మేకను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గొడుగు రమ యాకన్న తేజావద్బాలునాయక్ రవి వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*ఇట్లు,*
*ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్*
*సర్పంచ్, మనుబోతులగడ్డ



