కరప మండల కేంద్రం కరప చంద్రన్న సమావేశ మందిరంలో భారతరత్న డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరప MPDO శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను దుస్సాలువ కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించి, అభినందనలు తెలిపిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు.
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సమాజ నిర్మాణంలో, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత విశిష్టమైనదని, నిస్వార్థ సేవలందిస్తున్న ఉపాధ్యాయలకు ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


