గురు పౌర్ణమి సందర్భంగా ఉదయగిరి బీసీ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వంతు సహాయంగా టన్ను బియ్యాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. గురు పౌర్ణమి రోజున ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ఎంపీ అందించిన ఈ సహాయం అభినందనీయమని, భక్తులందరికీ సక్రమంగా అన్నప్రసాదం అందించేందుకు ఇది తోడ్పడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

గురు పౌర్ణమి సందర్భంగా ఉదయగిరి సాయిబాబా ఆలయ అన్నదానానికి ఎంపీ వేమిరెడ్డి టన్ను బియ్యం విరాళం
గురు పౌర్ణమి సందర్భంగా ఉదయగిరి బీసీ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వంతు సహాయంగా టన్ను బియ్యాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. గురు పౌర్ణమి రోజున ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ఎంపీ అందించిన ఈ సహాయం అభినందనీయమని, భక్తులందరికీ సక్రమంగా అన్నప్రసాదం అందించేందుకు ఇది తోడ్పడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

