ఖమ్మం:
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు మట్టి గణనాథుల విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్తంభాద్రి ఉత్సవ సమితి సభ్యులు విగ్రహాల తయారీ కేంద్రాలను పరిశీలించారు. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా విగ్రహాల ధరలు నిర్ణయించాలని తయారీదారులను కోరారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోద్ లాహోటి, ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, కార్యాధ్యక్షులు గేంటెల విద్యాసాగర్, కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ, కోశాధికారి మూలగుండ్ల శ్రీహరి, కార్యదర్శి ఈశ్వర ప్రగడ రామారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అల్లిక అంజయ్య పాల్గొన్నారు.


