ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 3 (పున్నమి ప్రతినిధ
మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన అశోక్, లావణ్య స్కూటీపై నెల్లూరుకు వెళ్తుండగా, పద్మావతి విలాస్ వద్ద యూటర్న్ తీసుకుని నెల్లూరు వైపు వెళ్తున్న కారు వారి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ హెడ్ కానిస్టేబుళ్లు మస్తానయ్య, బెల్లంకొండ మహేష్ ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.

కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 3 (పున్నమి ప్రతినిధ మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన అశోక్, లావణ్య స్కూటీపై నెల్లూరుకు వెళ్తుండగా, పద్మావతి విలాస్ వద్ద యూటర్న్ తీసుకుని నెల్లూరు వైపు వెళ్తున్న కారు వారి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ హెడ్ కానిస్టేబుళ్లు మస్తానయ్య, బెల్లంకొండ మహేష్ ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.

