– కుమార్తె విజయంతో గర్వపడుతున్న లాయర్ బాలాజీ
– చిట్వేల్ పట్టణంలో వెల్లివిరిసిన ఆనందం
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ పట్టణానికి చెందిన నాయుని ఉజ్వల వైద్య విద్యలో అడుగుపెట్టనుంది. శనివారం చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. చిన్ననాటి నుంచి కన్న కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో చదివి, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉజ్వల ఈ విజయాన్ని అందుకుంది. కుమార్తె సాధించిన విజయంపై ఆమె తండ్రి, లాయర్ బాలాజీ ఎంతో గర్వం వ్యక్తం చేశారు. కూతురు సాధించిన ఈ విజయం తమ కుటుంబానికి ఎంతో ఆనందం, గర్వకారణమని తెలిపారు. వైద్య విద్యలో రాణించి భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.


