ఉదయగిరిలో ఇంటింటికీ తెలుగుదేశం.. బోయ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటన
ఉదయగిరి టౌన్లోని బోయకాలనీ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కాలనీలో సిహెచ్. భారతి–వినోద్ కుమార్ దంపతుల ఎనిమిది మంది పిల్లలకు “తల్లికి వందనం” పథకం కింద ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున మొత్తం రూ.1.04 లక్షలు తల్లి ఖాతాలో జమైనట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఉదయగిరిలో ఇంటింటికీ తెలుగుదేశం.. బోయ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటన
ఉదయగిరిలో ఇంటింటికీ తెలుగుదేశం.. బోయ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటన ఉదయగిరి టౌన్లోని బోయకాలనీ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కాలనీలో సిహెచ్. భారతి–వినోద్ కుమార్ దంపతుల ఎనిమిది మంది పిల్లలకు “తల్లికి వందనం” పథకం కింద ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున మొత్తం రూ.1.04 లక్షలు తల్లి ఖాతాలో జమైనట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

