Saturday, 12 September 2026
  • Home  
  • అరకు: వైసీపీలో ఊపందుకున్న చేరికలు
- అల్లూరి సీతారామరాజు

అరకు: వైసీపీలో ఊపందుకున్న చేరికలు

అరకు నియోజకవర్గంలో వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. అరకు వ్యాలీ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వివిధ మండలాలకు చెందిన 120 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. పెదబయలు నుంచి 50 మంది, అనంతగిరి నుంచి 20 మంది, హుకుంపేట నుంచి 30 మంది, ముంచంగిపుట్టు నుంచి 20 మంది పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెంది వైసీపీలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, ఇతర నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

అరకు నియోజకవర్గంలో వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. అరకు వ్యాలీ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వివిధ మండలాలకు చెందిన 120 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. పెదబయలు నుంచి 50 మంది, అనంతగిరి నుంచి 20 మంది, హుకుంపేట నుంచి 30 మంది, ముంచంగిపుట్టు నుంచి 20 మంది పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెంది వైసీపీలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, ఇతర నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.