శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన మాజీ మంత్రి, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు స్థానిక మార్కెట్ యార్డ్లో బుధవారం ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొజ్జల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత వ్యక్తి బొజ్జల అని కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని బొజ్జలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు బొజ్జల సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

అభివృద్ధి ప్రదాత బొజ్జలకు రంగినేని ఘన నివాళి
శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన మాజీ మంత్రి, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు స్థానిక మార్కెట్ యార్డ్లో బుధవారం ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొజ్జల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత వ్యక్తి బొజ్జల అని కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని బొజ్జలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు బొజ్జల సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

