అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. శ్రీనివాస్ రావు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్ రావు మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

అనారోగ్యంతో మృతి చెందిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియల్లో పాల్గొననున్న కేసీఆర్
అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. శ్రీనివాస్ రావు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్ రావు మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

