.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ వ్యవస్థాపకుడు బిసి రమణ ఆధ్వర్యంలో మండల కమిటీ నియామక పత్రాలను సభ్యులకు అందజేయడం జరిగినది. బ్రహ్మంగారిమఠం మండల గౌరవ అధ్యక్షులుగా గోడ్లవీటి సుబ్రహ్మణ్యం ఆచారి, గౌరవ సలహాదారులుగా మలినేని రామయ్య,రాష్ట్ర కార్యదర్శిగా రాళ్లపాటి చిన్న మస్తాన్,మండల అధ్యక్షుడిగా మల్లె బాలకృష్ణను నియమించి నియామక పత్రాన్ని వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ సలహాదారుడు తమ్మిశెట్టి సుబ్బరాయుడు చేతులమీదుగా అందించడం జరిగినది.ఉపాధ్యక్షులుగా కలగొట్ల శ్రీనివాసులు,సిద్దయ్య, ఎర్ర నాగు ఓబయ్య,బంగారు జయ వీర వర్ధన్, ప్రధాన కార్యదర్శిగా గురవయ్యను,కొశాధికారీగా రెడ్ల దిన్నే ఖాదర్,ఆర్గనైజేషన్ సెక్రెటరీ సన్నపురి శ్రీను, అధికార ప్రతినిధి ఇటుకల ప్రసాద్, పెరుగు సుధాకర్, సహాయ కార్యదర్శి నాగిడి విజయ భాస్కర్,బోగా వీరయ్య
, కార్యవర్గ సభ్యులు ను నియమించి నియామక పత్రాన్ని అందించడం జరిగినది. కమిటీ సభ్యులందరికీ జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ నియామక పత్రం అందించారు. అనంతరం మండల కమిటీ సభ్యులు అందరి చేత ప్రమాణ స్వీకారం చేపించడం జరిగినది. కమిటీ సభ్యులందరూ జాతీయ బీసీ చైతన్య సమితి అభివృద్ధి కొరకు తమ వంతు బాధ్యతాయుతంగా కలసి పనిచేసి కలిసికట్టుగా ఉండాలని బీసీ రమణ సభ్యులందరినీ కోరారు.






