80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన – SDPI
నంద్యాల SDPI పార్టీ కార్యాలయం నందు 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SDPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ అతావుల్లా ఖాన్ గారు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి భారతదేశ పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో SDPI జిల్లా అధ్యక్షులు మణిహారం హనీఫ్ గారు, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్ గారు, జిల్లా, అసెంబ్లీ, వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


