Sunday, 13 September 2026

Tag: K

ఎన్ టి ఆర్ జిల్లా

మదర్ థెరీసా ట్రస్ట్ కొయ్య సుధా గారి ఆధ్వర్యంలో మైలవరం లో మట్టి విగ్రహాలు పంపిణీ

*పర్యావరణ హితమైన మట్టి గణపతిని పూజిద్దాం* *మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్, మైలవరం ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల దేవస్థానాల వంశపారాంపర్య ధర్మకర్తలు శ్రీ SVN నివృత్తరావు గారు, లయన్స్ శ్రీ వి.వి.పి.ఎస్. ఆంజనేయులు గారు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆత్మీయ అతిథి లయన్స్ శ్రీ డాక్టర్ వై. గాంధీ గారు పాల్గొన్నారు. చెందిన శ్రీ కొప్పు సచ్చినారాయణ గారు, ఎన్ఆర్ఐ, ఎన్టీఆర్ జిల్లా, మైలవరం తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సహకరించిన దాతలకు ధన్యవాదములు ఈ సందర్భంగా వారు ద్వారకా తిరుమల దేవస్థానాల పంచపారంపర్య ధర్మకర్త శ్రీ నివృత్తరావు మాట్లాడుతూ, పర్యావరణ హితమైన మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించాలని సూచించారు. మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు కోయ సుధను సంస్థ ప్రతినిధులనu వారు ప్రత్యేకంగా అభినందించారు. అందరి సమష్టి కృషితో ప్రజల్లో క్రమేపీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని అన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ విఘ్నాలు తొలగి, సుఖశాంతులు, శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, జనసేన తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయ సుధ మాట్లాడుతూ, కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.